Husband And Wife: మద్యం తాగొద్దని చెప్పిన భార్య.. అలాంటి నిర్ణయం తీసుకున్న భర్త!

Husband And Wife: సాధారణంగా పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న జీవితంలోకి కొన్ని సంఘటనలు తుఫానులా వచ్చి సంసారాన్ని నాశనం చేస్తుంటాయి. ఇలా క్షణికావేశంలో చాలామంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవ పెట్టే అతిపెద్ద విషయం మద్యం. భర్తలు తాగుడుకు బానిసగా మారి భార్యలకు చిత్రహింసలు పెట్టడం వంటివి చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఇలాంటి ఘటన బీహార్ లో ఒకటి చోటు చేసుకుంది. బ్రహ్మపూర్ బ్లాక్‌ డేరాలో నివసించే జగ్నారాయణ ఎక్కువగా మద్యం సేవించేవాడని, ఈ అలవాటు కారణంగా భార్య సవితతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే తన భార్య సవిత తన భర్తను వదిలి తల్లి గారి ఇంట్లో ఉంటుంది. అయితే సవిత తన ఇంట్లో ఉంటున్న తన భర్త తరచూ తనని కలవడానికి అక్కడికి వెళ్లేవారు.

ఈ క్రమంలోనే ఒకరోజు తన భార్యను కలవడానికి వెళ్లిన
జగ్నారాయణ సబితను తనతో పాటు ఇంటికి రావాలని కోరాడు.అయితే ఆమె తను మద్యం మానేస్తేనే తనతోపాటు వస్తానని చెప్పడంతో అప్పటికే తనతోపాటు తన వెంట యాసిడ్ తెచ్చుకున్న జగ్నారాయణ ఒక్కసారిగా తన భార్య సవిత పై దాడి చేశాడు.యాసిడ్ మొత్తం తనపై పోసే సరికి ఆమె తీవ్ర గాయాలపాలైన దీంతో వెంటనే ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి తన భర్తపై కేసును నమోదు చేశారు.