Suiside: గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఓ కుటుంబం.. ఏం జరిగిందంటే?

Suiside: రోజు రోజుకి సమాజంలో అత్యాచారాలు, హత్యలు, మానభంగాలతో పాటు ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా గృహిణిలు, అలాగే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కొనలేక ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన ఒకటి తెలంగాణా లో చోటుచేసుకుంది. ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఇంట్లో ఉండే గ్యాస్ లీక్ చేసుకుని ఆ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన స్థలానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. అయితే ఈ ఘటనలో మరొక బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాల్వంచ కు చెందిన మండిగ నాగ రామకృష్ణ నవభారత్ లో మీ సేవ సెంటర్ నిర్వహిస్తున్నారు.

ఇటీవలే డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో రామకృష్ణ సతమతమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో రామకృష్ణ ఇంట్లో నుంచి భారీగా శబ్దం రావడంతో స్థానికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో అక్కడికక్కడే రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య మృతి చెందారు. ప్రస్తుతం మరొక కుమార్తె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటనతో పాల్వంచలోని జెండార్ బజార్ లో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపట్లోనే అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.