నన్ను ఎందుకు ప్రేమించావు రేణు.. ప్రశ్నిస్తూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు?

ఆ కుర్రాడి వయస్సు పట్టుమని పాతిక సంవత్సరాలు కూడా లేకుండానే నిండు నూరేళ్ళు గడిచిపోయాయి. కేవలం తను ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేస్తుందన్న కారణంతో మానసికంగా ఎంతో కృంగిపోయిన ఆ యువకుడు చివరికి నన్నెందుకు ప్రేమించావు అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

జలౌన్‌లోని ఒరై దహెఖండ్ దివారా ప్రాంతానికి చెందిన శివం అనే కుర్రాడు డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ పోటీ పరీక్షలకోసం హిత్కారీ నగర్‌లోని లాల్జీ బాజ్‌పై హాస్టల్ లో వన్ టూ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఈ కుర్రాడికి రేణు అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.ఇలా వీరిద్దరి కొద్దిరోజులపాటు ప్రేమలో ఉన్నప్పటికీ ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరి మధ్య సంభాషణ కొనసాగలేదు. దీంతో మనస్తాపం చెందిన శివం అద్దం వెనుక భాగాన తన ప్రియురాలి ఫోటోలు అతికించి నన్ను ఎందుకు మోసం చేశావు రేణు నన్ను ఎందుకు ప్రేమించావు అంటూ సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

శివం తండ్రి ఎన్ని సార్లు తన కొడుకుకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ యజమానికి ఫోన్ చేసే చెప్పగా హాస్టల్ యజమాని శివం ఉన్న గదికి వచ్చి తలుపు కొట్టాడు. శివం ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులు శివం మృతి చెందడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను పరిశీలించగా వారికి సూసైడ్ లెటర్ తో పాటు అమ్మాయి ఫోటో కనిపించడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా తన ప్రియురాలు ఎక్కడ ఉంటుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.