యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ట్రేడ్ లలో అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 243 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 82 ఉండగా ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు కూడా 82 ఉన్నాయి. వెల్డర్ ఉద్యోగ ఖాళీలు 40 ఉండగా టర్నర్/ మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 12 ఉన్నాయి.

మెకానిక్‌(డీజిల్/ ఎంవీ) ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా ప్లంబర్ ఉద్యోగ ఖాళీలు 5, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి. జాదుగూడ యూనిట్- 102, నర్వాపహార్ యూనిట్- 51, తురమ్దిహ్‌ యూనిట్- 90 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అక్టోబర్ 13, 2023 నాటికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2023 సంవత్సరం నవంబర్ 12వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుండగా ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సులువుగా ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.