ఆ డిగ్రీ ఉన్నవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నార్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోఅం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. బీఎస్సీ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

 

మే నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎయిమ్స్ మంగళగిరిలో 117 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 3055 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. aiimsexams.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ స్థాయిలోనే వేతనం లభించనుంది. నర్సుగా రిజిష్టర్ అయిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. aiimsexams.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 3000 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు 2400 రూపాయలుగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, ఈ.డబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.