భారీ వేతనంతో మిధాని హైదరాబాద్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.2.2 లక్షల వేతనంతో?

మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. నెలకు గరిష్టంగా 2.2 లక్షల రూపాయల వేతనంతో ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. http://www.midhani-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 3 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

మొత్తం 3 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిప్యూటీ మేనేజర్ జనరల్, మేనేజర్, హౌజ్ కీపర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. టెన్త్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ అర్హతలు ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

రాత పరీక్ష/ప్రొఫిషియన్సీ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. http://www.midhani-india.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మిథాని సంస్థలో ఉద్యోగ ఖాళీల కోసం పోటీ ఒకింత ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. మిథాని సంస్థ ప్రముఖ సంస్థ కావడంతో ఈ సంస్థలో ఉద్యోగాలకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.