అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. రూ.1,82,400 వేతనంతో?

అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 260 సైంటిస్ట్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.1,82,400 వేతనం లభించనుంది. సంబంధిత కోర్సుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండగా మొత్తం 51 విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు పీహెచ్డీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 300 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఈ రాత పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 60 మార్కులు, పరిశోధన ఫలితాలకు 40 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జులై 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. నవంబర్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది.