అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు, ముఖ్యంగా శుద్ధి చేసినవి మరియు చక్కెర జోడించినవి, రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్, ఫిజీ డ్రింక్స్ మరియు జ్యూస్లు వంటి ఆహారాలు. బియ్యం, బ్రెడ్, పండ్లు, చక్కెర అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు అనే సంగతి తెలిసిందే. మిఠాయి, కుకీలు, కేక్, ఐస్ క్రీం, తీపి తృణధాన్యాలు, చక్కెరతో చేసిన పండ్లు, జ్యూస్, సోడా చక్కెరతో ఉన్న ఆహారాలు అని చెప్పవచ్చు.
అధిక జిఐ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే శుద్ధి చేసిన మరియు చక్కెరతో కూడిన ఆహారాలను తగ్గించాలి. ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, నట్స్, గింజలు లాంటి ఫైబర్ ఉన్న ఆహారాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించాలనుకునే వారు డాక్టర్ లేదా డైటీషియన్ తో మాట్లాడటం మంచిది. వింటర్లో షుగర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ అని చెప్పవచ్చు. ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర, పుంటి కూర, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు ఆహారంలో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.
మధుమేహం ఉన్నవాళ్లు అందరిలా రోజుకి 3 పూటలు కాకుండా.. తక్కువ మోతాదులో 7, 8 సార్లు తినాలి. పైగా టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్నింటినీ ఒకే సమయానికి తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మానకూడదు. గుడ్లు, బీన్స్, బ్రకోలి, పాలకూరలు రోజూ తీసుకోవాలి. భోజనంతో పండ్లను తీసుకోవాలి. రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలు తినాలి. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహార విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.