జియో స్టూడియోస్ & B62 స్టూడియోస్, రణవీర్ సింగ్, స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్‌ ‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్

Dhurandhar The Revenge: ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ధురంధర్ ది రివెంజ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం, ఆల్ టైం బిగ్గెస్ట్ హిందీ చిత్రంగా నిలిచిన తర్వాత, ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది, మరింత గొప్ప కాన్వాస్‌పై, తీవ్రతను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్ళింది.

ట్రైలర్‌లో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ పాత్రలో మరోసారి తీవ్రతతో కనిపించారు. ఈసారి ఆయన జస్కిరత్, హమ్జా అనే రెండు పాత్రల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కథలో కీలక పాత్రలుగా ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో భయంకరమైన విలన్‌గా, అలాగే సంజయ్ దత్ ఎస్‌పీ చౌధరి అస్లంగా శక్తివంతమైన పాత్రలో కనిపించారు.

అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాలు, పదునైన డైలాగ్స్, థియేటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ విజిల్స్ వచ్చేలా చేసే సన్నివేశాలతో ట్రైలర్ మొత్తం ఒక భారీ రివెంజ్ సాగాకు నాంది పలుకుతోంది.

“హోంస్లా. ఈంధన్. బద్లా.” అనే ట్యాగ్‌లైన్ ఈ సీక్వెల్‌ను ముందుకు నడిపించే రివెంజ్ కథను సూచిస్తోంది.

జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంగా, ఈద్‌కు ముందు ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో విడుదల కానుంది.

అజ్ఞాత వీరుల కథ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2026 మార్చి 19న ఆవిష్కృతం కానుంది.

జగన్ ను చూసి భయం | Pawan Kalyan Interesting Comments On YSRCP MLAs Strength | AP Politics | TR