యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం, భార్య భర్తల మృతి (వీడియో)

యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లగూడం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వరంగల్ హైవే పై కారును టిప్పర్ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. రోడ్డు ప్రమాద వీడియో కింద ఉంది చూడండి.

 

yadadri road accident

మృతులను శ్రీనివాస్ రెడ్డి, అతని భార్య వీరు గా గుర్తించారు. వీరు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైవే పై ప్రమాదం జరగడంతో నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి బంధువులకు సమాచారమిచ్చారు.

 

ఇది కూడా చదవండి, వినండి

 

తెలంగాణా గల్ఫ్ పాట