తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియోలు)

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే చనిపోగా మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. చనిపోయిన ఆరుగురు కూడా మహిళలే. కాకినాడలోని బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంత విశాఖ జిల్లా మాచవరపాలెం మండలం జి వెంకటాపురం గ్రామానికి చెందిన వారు.

ఆటోలో 15 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని పిఠాపురం, కాకినాడ ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం వీడియోలు కింద ఉన్నాయి చూడండి. 

 

 

 

 

east godavari accident