చంద్రబాబుకు జైలే గతా ? ఎంపి జోస్యం (వీడియో)

వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడును జైలుకు పంపాలని వైసిపి గట్టిగా నిర్ణయించుకున్నదా ? పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన తాజా ప్రకటనతో అందరిలోను అదే అనుమానం మొదలైంది. విజయసాయి మాట్లాడుతూ, చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందంటూ ఎద్దేవా చేశారు. లేకపోతే రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన సిబిఐ, ఐటి, ఈడి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్ధలను అడ్డుకునే ప్రయత్నాలు చేయటమేంటి ? అంటూ నిలదీశారు.

 

ఇఫ్పటికే రాష్ట్రంలోకి  సిబిఐ ఎంట్రీని అడ్డుకుంటూ జీవో జారీ చేసిన చంద్రబాబు మిగిలిన దర్యాప్తు సంస్ధలను అడ్డుకుంటానని చెప్పటం చూస్తే అందరికీ అనుమానం పెరిగిపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ బాబు స్ధాపించిన రాజ్యమనుకుంటున్నావా చిట్టినాయుడు అంటూ రాజ్యసభ సభ్యుడు మండిపడ్డారు. దేశంలో రాష్ట్రం కూడా భాగమే అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సహచరులు, మద్దతుదారులు, చెంచాలు ముఖ్యంగా సుజనా చౌదరి రూ 6 వేల కోట్లకు మోసాలకు పాల్పడినట్లు ఈడి ఆధారాలతో సహా బయటపెట్టిన విషయాన్ని ఎంపి గుర్తుచేశారు.

చంద్రబాబుకు జైలు జీవితం తప్పదా

ఇంతకాలం దర్యాప్తు సంస్ధలను మ్యనేజ్ చేసుకుంటూ బతికిపోయింది చాలకుండా ఇపుడు దర్యాప్తు అన్న మాట వింటేనే చంద్రబాబు వణికిపోతున్నట్లు చెప్పారు. చంద్రబాబు బందిపోట్ల ముఠా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నా ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారా అంటూ నిలదీశారు. మరో ఆరు నెలల తర్వాత జనాలు చంద్రబాబు అండ్ కోను తరిమికొడతారని, బట్టలూడదీసి నిలబెడతారంటూ ఎంపి జోస్యం చెప్పారు. అందుకనే ఇఫుడే వైజాగ్ సెంట్రల్ జైల్లో గానీ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోగాని ఓ బ్యారక్ సిద్ధం చేసుకోవాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత బ్యారక్ లో సౌకర్యాలు లేవని ఏడుస్తారనే ముందుగా చెబుతున్నట్లు విజయసాయి చేసిన హెచ్చరిక సంచలనంగా మారింది.