టిఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని పద్మవ్యూహంలో బంధించేందుకు టిఆర్ ఎస్ కొత్త రకమైన ఎత్తుగడకు దిగుతున్నట్టు కనబడుతున్నది. రానున్న ఎన్నికల్లో రేవంత్ ను కొడంగల్ లో ఓడించాలనుకొని ఇప్పటివరకు టిఆర్ ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.
ఈ యాక్షన్ ప్లాన్ తెరమీద కనబడేది మాత్రమే. తెర వెనుక యాక్షన్ ప్లాన్ బీ కూడా రెడీ చేసినట్టు రేవంత్ శిబిరం అనుమానిస్తోంది. టిఆర్ఎస్ తెర వెనుక శిబిరం పై రేవంత్ శిబిరం అలర్ట్ అయ్యింది. అయితే టిఆర్ఎస్ పద్మవ్యూహంలో చిక్కకుండా రేవంత్ పై ఎత్తులు సురువు చేశారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…
తన పై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలపాలంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో క్రిమినల్ కేసులు పొందుపరచాలని ఆర్టీఐ ద్వారా సమాధానం అడిగితే ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
తెలంగాణ డిజిపి, ఆర్టీఐ కమిషనర్ ను రేవంత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. పోలీసులు తన పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. చాలా ప్రాంతాలలో తనపై అక్రమ కేసులు పెట్టారని అందుకే ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగానన్నారు. ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత కేసుల పేరుతో ఆపితే పోటికి అనర్హుడిని అయ్యే అవకాశం ఉందన్నారు. కేసుల వివరాలు చెబితే నామినేషన్ లో చేరుస్తానన్నారు. రేవంత్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు నవంబర్ 6 వ తేదికి విచారణను వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే రేవంత్ పై మరో కేసు ఉచ్చు బిగుస్తోంది. ఓటుకు నోటు కేసు స్పీడ్ అప్ చేయాలని సుప్రీం కోర్టు లో వైసిపి పిటిషన్ వేసింది. ఓటుకు నోటు కేసును ఫిబ్రవరిలో విచారించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కేసును త్వరగా విచారించాలని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో కేసును విచారించాలనడం పై చంద్రబాబు తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి, మార్చి సమయంలో ఎన్నికలున్నాయని తెలపగా మేమేం చేయలేం అని జస్టిస్ మదన్ బి.లోకూర్ అన్నారు. దీంతో ఫిబ్రవరిలో ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది. ఇదంతా కావాలనే టిఆర్ ఎస్ , వైసిపిలు చేయిస్తున్నాయని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.
