ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో విషాదం జరిగింది. చంద్రబాబు మేనల్లుడు ఉదయ్ కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హూటాహూటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ బిజినెస్ వర్క్సు చేసేవాడు. ఆయన కుటుంబం హైదరాబాద్ లోనే స్థిర పడింది. ఉదయ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న చంద్రబాబు అమరావతి నుంచి హైదరాబాద్ బయల్దేరినట్టు తెలుస్తోంది. ఉదయ్ కుమార్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని తన స్వంత నివాసానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం నారావారి పల్లెకు తరలిస్తారు. శనివారం ఉదయం నారావారిపల్లెలో ఉదయ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఉదయ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న వెంటనే నారా భువనేశ్వరి ఉదయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలు ఉదయ్ కుమార్ ఇంటికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు.
