సీఎం కేసీఆర్ ను కలిసిన టిడిపి సండ్ర వెంకట వీరయ్య

సీఎం కేసీఆర్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రగతి భవన్ లో కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సండ్ర కేసీఆర్ ను కలవడంతో చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల పంటను కాపాడేందుకు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి నీటి విడుదల పై చర్చించినట్టు తెలుస్తోంది. దీని పై వెంటనే స్పందించిన కేసీఆర్ నీటి విడుదలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ ను ఆదేశించారు.

సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాల్లోని మెట్ట, ఆరుతడి పంటలకు నీరందించాలని సండ్ర కోరారు. సండ్ర టిఆర్ఎస్ లో చేరేందుకే కలిశారన్న చర్చ సాగుతోంది. కేవలం నీటి విడుదల గురించే మాట్లాడినట్టు సండ్ర వ్యాఖ్యానించారు. మరి కొన్ని రోజుల్లో అసలు విషయం బయటపడుతుందని నేతలు చర్చించుకున్నారు.