రాజకీయాల్లోకి రెబల్ స్టార్ భార్య… ప్రభాస్ ఓకే?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ… ఇప్పటికే వాతావరణం తీవ్రస్థాయిలో వేడెక్కుతుంది. ఈ సమయంలో ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించుకుంటున్నారు. ఇందులో భాగంగా… తాజాగా వైసీపీ అధినాయకత్వం సరికొత్త నిర్ణయం తీసుకుందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

వైసీపీ ఎంపీలందు నరసాపురం ఎంపీ వేరయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. గడిచిన ఎన్నికల్లో.. “తన గెలుపులో తన పాత్ర అధికం.. జగన్ పాత్రం అతి స్వల్పం” అంటూ వైసీపీపై ఎర్ర జెండా ఎగరవేశారు ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇందులో భాగంగా… ప్రస్తుతం ప్రతిపక్షాలను సైతం వెనక్కి నెట్టి మరీ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్. కు ఎట్టిపరిస్థితుల్లోనూ బలమైన చెక్ పెట్టాలని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, రఘురామ కృష్ణంరాజుని ఓడించడం కూడా అంతే ముఖ్యం అనేస్థాయిలో వైసీపీ అధిష్టాణం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా నరసాపురం పార్లమెంటు స్థానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ సమయంలో రఘురామకృష్ణం రాజుకు అదే సామాజికవర్గం ఉంచి చెక్ పెట్టాలని ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

అవును… రఘురామకృష్ణం రాజుని ఓడించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ అధిష్ణాణం… వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీకి, వైసీపీ నుంచి రెబల్ స్టార్ దివంగత నటుడు కృష్ణంరాజు భార్య ను రంగంలోకి దింపాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న నేత ఇప్పటికే ఈ సంకేతాలను పంపించారని సమాచారం.

అయితే ఈ ఆఫర్ పై శ్యామలా దేవి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాం తీసుకోలేదని తెలుస్తుంది. అయితే మున్ముందు ఆమె తమ ప్రతిపాదనలను అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది. ఫలితంగా అటు ఆర్.ఆర్.ఆర్. కు సొంత సామాజికవర్గం నుంచే చెక్ పెట్టడంతో పాటు.. అటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మద్దతును కూడా పొందొంచ్చని భావిస్తుందని తెలుస్తుంది! మరి ఇలా వైసీపీ వేసిన తాజా ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.

ఒక వేళ నిజంగా వైసీపీ ప్రతిపాదనకు శ్యామలా దేవి అంగీకరిస్తే.. అందుకు ప్రభాస్ సానుకూలంగా స్పందిస్తే… ఇక పశ్చిమగోదావరి జిల్లాల్లో ఫ్యాన్ గాలి ఫైవ్ లో పెట్టినంత స్పీడుగా తిరుగుతుందనడంలో సందేహం ఉండదని అంటున్నారు పరిశీలకులు.