పవన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మతిరిగిందా ?

ఓటమి బాధలో ఉన్న చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద షాకే ఇచ్చాడు. పవన్ దెబ్బకు మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లైంది చంద్రబాబు పరిస్ధితి. కరకట్ట మీదున్న అక్రమ కట్టడాల్ని కూల్చేయటంలో తప్పేమీ లేదని పవన్ తాజాగా ఇచ్చిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది.

చంద్రబాబు హయాంలో ప్రభుత్వమే నిర్మించిన అక్రమ నిర్మాణం ప్రజావేదికను కూల్చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే జగన్ ఉన్నతాధికారులకు కూల్చివేత ఆదేశాలిచ్చారో అప్పటి నుండి టిడిపి నేతలు మండిపోతున్నారు. నిసిగ్గుగా అక్రమ కట్టడాల కూల్చివేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

కొద్ది రోజులుగా ఇదే  విషయమై వైసిపి-టిడిపి నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. కలెక్టర్ల సమావేశంలో జగన్ ఆదేశాలిచ్చాడో లేదో మాటల యుద్ధం మరింత పెరిగిపోయింది. అయితే వీళ్ళ వివాదం ఇలా ఉండగానే పవన్ టిడిపి పై పెద్ద బాంబే వేశారు.

కరకట్ట మీదున్నది అక్రమ నిర్మాణాలే అయితే కూల్చేయటంలో తప్పేమీ లేదన్నారు. పైగా అక్రమ కట్టడాల్ని కూల్చేయాల్సిందేనంటూ చెప్పటంలో ఎన్నో అర్ధాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, పవన్ చెప్పింది ప్రజావేదికను కూల్చేయటం గురించే అయ్యుండొచ్చు.

కానీ చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా అక్రమ నిర్మాణమే. లింగమనేనిదే కాకుండా ఇంకా చాలా నిర్మాణాలే ఉన్నాయి లేండి. పవన్ ఉద్దేశ్యంలో ప్రజావేదికే కాకుండా లింగమనేని గెస్ట్ హౌస్ కూడా కూల్చేయాలనేనా అంటూ టిడిపి నేతలు  మండిపోతున్నారు.