మనల్ని ఎవడన్నా ఆపుతుంది?

“మమ్మల్ని ఎవడురా ఆపేది”.. ఇది పవన్ కళ్యాణ్ గర్జన. వారాహీ అనే వాహనాన్ని అభిమానులకు, కార్యకర్తలకు చూపించిన అనంతరం… పవన్ ఇచ్చిన బలమైన స్టేట్ మెంట్ ఇది! దానికి కారణం… వారాహిని ఏపీలో తిరగనివ్వమని అప్పట్లో వైసీపీ నాయకుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఎవరు ఆపినా తిరుగుతామని జనసేన నుంచి సమాధానం వచ్చింది. వారాహి రధాన్ని అలా జనంలో ఉంచుతామని ఏపీ అంతా అల్లాడిస్తామని కూడా భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అయితే… ఇవి ఇప్పటికే స్టేట్ మెంట్స్ గానే మిగిలిపోయిన పరిస్థితి.

అవును… రోజు రోజుకీ వారాహి విషయంలో టెన్షన్ పడిపోతున్న జనసైనికులు పవన్ ను ఆన్ లైన్ వేదికగా “మనలి ఎవడన్నా ఆపుతుంది..?” అని ప్రశ్నిస్తున్నారు. కారణం… ఏపీలో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కుతుంది. ఒకపక్క జగన్.. జిల్లాల టూర్లతో సభలతో బిజీగా ఉన్నారు. చంద్రబాబు అయితే షెడ్యూల్ ఒకటి పెట్టుకుని మరీ ఏపీకి తరచుగా వచ్చి పోతున్నారు. ఇదే క్రమంలో… లోకేష్ పాదయాత్ర మూడో జిల్లాలో సాగుతోంది. ఇలా అని రాజకీయ పార్టీలు వారికి తోచిన తీరున ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీలో ఉంటే… జనసేన నుంచి మాత్రం కనీసంగా కూడా రియాక్షన్ కూడా లేదనేది జనసైనికుల ఆవేదన!

ఇందులో భాగంగా… ముందు వారాహి రధాన్ని జనంలో పెట్టి తిప్పేందుకు దిక్కు లేదు కానీ.. ఏపీని కాపాడుతారా అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. ఏపీని కాపాడే బాధ్యత నాది అంటూ పవన్ పలుకుతున్న బీరాలకు ఇవి కౌంటర్లు. ఇక్కడ నెటిజన్లు చెబుతున్న లాజిక్ కూడా అర్ధవంతంగానే ఉండటంతో… జనసైనికులు సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. అవును… “వారాహి రధం మీది.. మీ చేతులలో ఉంది.. దానికే ఎపుడు ఏమిటి ఎలా అని విషయాలు చెప్పలేని మీరు… అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఉన్న ఏపీ విషయంలో మాత్రం ఎందుకీ భారీ స్టేట్మెంట్స్” అని వెటకారమాడుతున్నారు. వాస్తవం కూడా ఇదేగా… విశ్లేషకుల అభిప్రాయం!

మరి ఈ విషయంలో పవన్ ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా? లేక, ఎవరు ఎన్ని రాసుకున్నా, ఎవరి ఎన్ని చూపించుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా… చంద్రబాబు నుండి తనకు సరైన రోడ్ మ్యాప్ అందేవరకూ రంగంలోకి దిగేది లేదని చెబుతారా? ఫలితంగా జనసైనికుల ఆగ్రహాన్ని సైతం చూడాల్సిన పరిస్థితిని ఎదుర్కుంటారా? అనేది వేచి చూడాలి! ఏది ఎమైనా… పవన్ రాజకీయాలకు అనర్హుడనే కామెంట్లకు ఈ ప్రవర్తన బలం చేకూరుస్తుందని అంటున్నారు విశ్లేషకులు!