పవన్ కి ప్రాణహాని… కామెంట్స్ వైరల్!

పవన్ యాగాలు చేసి, పూజలు చేసి వారాహి యాత్ర ప్రారంభించిన వేళ కొన్ని కీలకమైన కామెంట్లు తెరపైకి వచ్చాయి. దీంతో… శుభమాని యాత్ర మొదలెడితే ఇవేమి మాటలంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే పవన్ పై ఈ స్థాయి కామెంట్లు చేసింది… కేఏ పాల్! అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి!

అవును… పవన్ పై కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం పవన్ పై వెటకారపు మాటలు, అప్పుడప్పుడు తమ్ముడూ అంటూ కలుపుకోవడాలు చేస్తూ వచ్చిన కేఏ పాల్… తాజాగా పవన్ కి ప్రాణ హాని ఉందని చెబుతున్నారు. అది కూడా పవన్ మిత్రుడు చంద్రబాబు వల్లంట. వచ్చే ఎన్నికల్లో సింపతీ ఓట్ల కోసం పవన్ కి చంద్రబాబు ప్రాణహాని తలపెట్టవచ్చని, వేరే వాళ్లతో పవన్ ని చంపించేసి.. ఆ నెపం జగన్ పై నెట్టేసి ఓట్లు కొల్లగొట్టాలనుకోవచ్చని చెప్పుకొస్తున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు చేస్తున్న ఆ భారీ కుట్ర వ్యూహంలో చిక్కుకోవద్దని, చంద్రబాబుకి దూరంగా ఉండాలంటూ పవన్ కు హితబోధ చేస్తున్నారు పాల్. అయితే ఈ సందర్భంగా పాల్ కొన్ని కీలక ప్రకటనలు, సూచనలు చేశారు. అయితే పవన్ అభిమానులు కూడా అవే కోరుకుంటుండటంతో వాటిపై మరింత ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

జనసేన తాజాగా మొదలుపెట్టిన వారాహి యాత్రలో తానే సీఎం అని పవన్ ప్రకటించుకోవాలని సలహా ఇచ్చారు కేఏ పాల్. అలా ప్రకటించకపోతే ఆ యాత్రను ఎవరూ లెక్కచేయరని కూడా హెచ్చరించారు. కేవలం సీఎం జగన్ ని తిడుతూ.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం కోసం వారాహి యాత్రను చేపట్టడం మూర్ఖత్వం అని కేఏ పాల్ తేల్చి చెప్పారు.

అనంతరం “ప్రజాశాంతి పార్టీతో కలసి పనిచేయాలి” అంటూ ఫైనల్ గా తమ్ముడు పవన్ కి ఎప్పుడూ చేసే సూచనే చేశారు పాల్.