ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు సీరియస్గానే తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిస్తే.. జగన్ పాలనకు ఇది రెఫరెండం అని చెప్పొచ్చని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తుంటే… అన్ని స్థానాలు గెలిచి “2024 కి ఇది సాంపుల్” అని చెప్పాలని అధికారపార్టీ చూస్తుంది! దీంతో… వైసీపీ, టీడీపీ, బీజేపీలు.. ఎవరికి వారే తమ తమ అభ్యర్థును నిలబెట్టుకుని సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు!
సరే ఆ ముడు పార్టీలకూ సమస్య ఉంటే… మధ్యలో జనసేనకు ఏమి ప్రాబ్లం. సైలంటుగా ఉంటే సరిపోద్ది కదా అనుకుంటే పొరపాటే! ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన జెండా ప్రత్యక్షంగా తిరగకపోయినా.. పరోక్షంగా చాలా బాధ్యతే ఉందనేది ఇప్పుడు ప్రధానంశం. ఎందుకంటే… బీజేపీనుంచి ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న నేతలు నేరుగా పవన్ ను సంప్రదిస్తున్నారంట. ఇప్పటికే పొత్తులో ఉన్నాము కాబట్టి.. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి పూర్తి సహకారం కావాలని కోరుతున్నారంట.
ఇక రాబోయే కాలంలో కాబోయే బహిరంగ మిత్రుడిగా చెప్పుకుంటున్న టీడీపీ నేతల నుంచి కూడా… పవన్ కు స్వయంగా ఫోన్స్ రావడం, తమకు పూర్తి మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ లు పెట్టుకోవడం చేస్తున్నారంట. దీంతో పవన్ పరిస్థ్హితి ఎటూ తేల్చుకోలేకుందంట. బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలపొచ్చు.. కానీ బాబు గారు హర్ట్ అవుతారనే ఆందోళన ఒకవైపు… టీడీపీకి బహిరంగంగా మద్దతు తెలిపితే, పొత్తు లేకుండా ఈ పంచాయతీలు ఏమిటి.. అందుకే దత్తపుత్రుడు అనేది అని వైకాపా నేతల నుంచి వచ్చే కామెంట్లు మరోవైపు!
దీంతో… ఏ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకుండా.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లు ఉందామనుకుంటే.. జనసైనికులు ఒప్పుకోవడం లేదంట. ఎన్నిక ఏదైనా తమ జెండా తిరగాల్సిందే అని పట్టుబడుతున్నారంట. మరి ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ప్రస్తుత మిత్రుడికి తోడుంటారా – కాబోయే మిత్రుడు అని చెబుతున్న టీడీపీకి తోడెళ్తారా అన్నది తెలియాలంటే వేచి చూడాలి!
దీంతో… ఈ ఎన్నికల్లో పవన్ ఎవరికి మద్దతు ఇచ్చినా.. ఆ పార్టీతోనే పొత్తు రాబోయే ఎన్నికలకు ఫైనల్ అవ్వొచ్చని.. జనాలు కూడా అదే ఫిక్సయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు! అలా కాకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ బీజేపీకి మద్దతు ఇచ్చి – సార్వత్రిక ఎన్నికల సమయానికి సైకిల్ ఎక్కే ఛాన్స్ లు కూడా లేకపోలేదనేది మరో అభిప్రాయం!
