స్థాయి తగ్గించుకున్న పవన్ కళ్యాణ్.! ఇదీ వ్యూహాత్మకమేనా.?

వీకెండ్ రాజకీయాల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యలయంపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిపోయారు.. ‘నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? అని.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ మంత్రులూ కార్యకర్తలూ అంత కంటే దారుణంగా పవన్ కళ్యాణ్‌ని తూల నాడారు. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నాడు.?

అసలు ఆయన రాజకీయ నాయకుడేనా.? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే విషయం వేరేలా వెళుతోంది. ముఖ్యమంత్రి మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో లోతైన చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ట్రాప్‌లో వైసీపీ పూర్తిగా పడిపోతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్‌ని ఎంత లైట్ తీసుకుంటే వైసీపీకి అంత మంచిది. చూసి చదవడం కూడా ముఖ్యమంత్రికి చేత కావడం లేదు.. అని పవన్ కళ్యాణ్ ప్రతీసారీ విమర్శిస్తున్నారు.

దానికి మానసిక అనారోగ్యం అనే కొత్త మాట తాజాగా యాడ్ చేశారు. నిజమే కదా.1 జగన్ గతంలో స్పష్టంగా మాట్లాడగలిగేవారు. ఇప్పుడెందుకు.! స్లిప్పులు చూడకుండా చదవలేకపోతున్నారు. స్లిప్పులు చూసి కూడా తప్పులు చదువుతున్నారు.. అని జనమే కాదు, వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోతున్నాయ్.

పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలిస్తోంది. ముఖ్యమంత్రి అయ్యాకా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా వైఎస్ జగన్ భయపడుతున్నారు.. ఎందుకు.? అసలేంటీ ఆయన సమస్య.? ఇది అర్ధం కాక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారు.

@AkBigNews నువ్వెంత నీ బ్రతుకెంత నీ స్థాయి ఎంత - పవన్ కళ్యాణ్