RTC Bus Fire: విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఒడిశా ఆర్టీసీ బస్సులో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి జయపుర్‌కు వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు (Odishha RTC Bus) అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల బస్సులోని సుమారు 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు.

ఈ దుర్ఘటన గురువారం తెల్లవారుజామున (సుమారు 4 గంటల ప్రాంతంలో) పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం, రొడ్డవలస సమీపంలో చోటు చేసుకుంది. బస్సు రొడ్డవలస వద్ద ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఇంజిన్ ఒత్తిడికి గురైంది. తొలుత పొగ వెలువడగా, క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సును నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి, వారిని బస్సు నుంచి కిందకి దించారు. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఘాట్ రోడ్డుపై ఈ దుర్ఘటన జరగడంతో సహాయక చర్యలు చేపట్టేలోపే అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. ఒడిశాకు చెందిన ఈ ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమై, నిలిచిపోయింది. జయపుర్‌కు చేరుకోవాల్సిన ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఒడిశా ఆర్టీసీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Medical Students Gives Big Shock To Chandrababu | PPP | PRIVATISATION | Telugu Rajyam