ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రేషన్ పంపిణీ విషయంలో ప్రజలు సంతృప్తితో లేరు. రేషన్ వాహనాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయో తెలియక ప్రజలు నిత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో బియ్యం మినహా ఇతర సరుకుల పంపిణీ జరగకపోవడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రేషన్ సరుకుల పంపిణీ సరిగ్గా జరగడం లేదని పేదలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు కందిపప్పు, చక్కెర ధరలు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు కారణమవుతున్నాయి. మరోవైపు కేంద్రం అందిస్తున్న బియ్యం పేద ప్రజలకు సరిగ్గా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేషన్ సరుకులకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. స్టాక్ పాయింట్లలో అవకతవకలు చోటు చేసుకుంటున్నా జగన్ సర్కార్ సరిగ్గా స్పందించడం లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ ఈ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఏ ఎన్నికల్లో అయినా గెలవాలంటే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఓట్లు కీలకం అనే సంగతి తెలిసిందే.
జగన్ సర్కార్ ఈ విషయాన్ని మరిచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాలను చెప్పుకోదగ్గ స్థాయిలో అమలు చేస్తున్న జగన్ సర్కార్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే రేషన్ సరుకుల అమలు తీరుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
