కన్నా ముహూర్తం ఫిక్స్… పవన్ కు ఇదే ప్రోబ్లం!

కొన్ని రోజుల క్రితం బీజేపీ నుంచి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. టీడీపీలో చేరబోతున్నారని అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే! ఆ కథనాలను నిజం చేస్తూ.. టీడీపీ తీర్ధం పుచ్చుకోవడానికి కన్నా ఫిక్సయ్యారు. అందుకు ముహూర్తం కూడా సెట్ చేశారు.

అవును… అంతా ఊహించినట్లుగానే కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ లో చేరడానికి ఫిక్సయ్యారు. అందుకు ఈ నెల 23న ముహూర్తం సెట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కన్నా… జగన్ సర్కార్ పాలనవల్ల రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారిపోయిందని, అమరావతి విషయంలో జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, ఈ సమయంలో చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని బాగుచేయగలరని చెప్పుకొచ్చారు.

అనంతరం… బీజేపీ నుంచి వచ్చాక అన్ని రాజకీయ పార్టీలూ ఆహ్వానాలు పంపాయి కానీ.. చంద్రబాబే కరెక్ట్ అని తాను, తన అనుచరులు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ… తనకు పవన్ అంటే ఎంతో అభిమానం, ప్రేమా అని చెప్పుకునే కన్నా… జనసేనలో ఎందుకు చేరడం లేదు అనే ప్రశ్నకు కూడా పరోక్షంగా సమాధానం దొరికిందనే అనుకోవాలి!

ఎందుకంటే… చంద్రబాబుకు మాత్రమే రాష్ట్రాన్ని బాగుచేయగల శక్తి, సమర్ధత, దక్షత ఉన్నాయని చెబుతున్నారు కన్నా. అంటే… పవన్ కు అవేమీ లేవని తాను విశ్వసిస్తున్నట్లే కదా!! దీంతో… జనసేనను పవన్ సామాజికవర్గ నేతలే నమ్మనప్పుడు.. ఇంక మిగిలిన నేతలు, మిగిలిన జనాలు మాత్రం ఎలా నమ్ముతారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని అంటున్నారు విశ్లేషకులు! జనసేనకు ఇవే అతిపెద్ద సమస్యలు అని.. పవన్ పాలిటిక్స్ ని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులమని చెప్పుకునేవారు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదనడానికి ఇదొక ఉదాహరణ అనేది మరో కామెంట్!

ఏది ఏమైనా.. 23వ తేదీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ లీడర్ అన్నమాట!!