మద్దతు కోరుతూనే ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేసిన కేఏ పాల్!

ka paul and pawan kalyan

తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ధర్నాకు మద్దతు ఇవ్వాలి అని కేసిఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మద్దతు కోరాడు. అంతేకాకుండా వారిపై విమర్శలు కూడా చేశారు.

కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ హాస్యస్పదమాన్ని వెటకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పదేళ్లల్లో తొమ్మిది పార్టీలతో కలిశాడు అని.. ఆయన ఎటువంటి రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించారు. ఇక హైదరాబాదులో తను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్ లో పెట్టాలి అంటూ తనపై బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు అని అన్నారు. ఇక ఆగస్టు15 లోపు పునర్విభజన చట్టంలో హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు.