Konidela Nagababu: వైసీపీ మొత్తం ‘ఇన్సానిటీ జోన్’లోకి వెళ్ళిపోయింది: ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Konidela Nagababu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీ శ్రేణులు తమ విచక్షణను కోల్పోయాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రస్తుతం ఒక రకమైన ‘ఉన్మాద స్థితి’ (Insanity Zone) లో ఉందంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీలో అగ్ర నాయకత్వం పొరపాట్లు చేస్తే, రెండో శ్రేణి నాయకులు వాటిని సరిదిద్ది పార్టీని గాడిలో పెడతారని, కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదని నాగబాబు పేర్కొన్నారు.

“పార్టీ అధినేత తన ఇంగిత జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన్ను సరిదిద్దాల్సిన నాయకత్వం, కింది స్థాయి కేడర్ కూడా తమ బుర్రలకు పని చెప్పడం మానేశారు. నాయకుడు ఏం చేసినా అది సరైనదే అన్నట్లుగా గుడ్డిగా అనుసరిస్తున్నారు” అని ఆయన విమర్శించారు.

వైసీపీని ఉద్దేశించి ‘మావిగన్’ అని సంబోధిస్తూ.. ఆ పార్టీ నాయకుల ప్రవర్తనా శైలి, వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అందరూ ఒకేసారి ఆలోచించడం మానేసినట్లు అనిపిస్తోందని నాగబాబు ఎద్దేవా చేశారు. ఒక వ్యవస్థలో అందరూ విచక్షణ కోల్పోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

వైసీపీ నాయకత్వంలో కనిపిస్తున్న ఈ మార్పులను ప్రజలు నిశితంగా గమనించాలని నాగబాబు కోరారు. ఒక పార్టీ మొత్తం ఇలాంటి ‘పిచ్చి’ జోన్‌లోకి ప్రవేశించడం వల్ల వచ్చే పరిణామాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

గత కొంతకాలంగా వైసీపీ అనుసరిస్తున్న తీరుపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వరుస విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ట్వీట్‌తో ఆయన మరోసారి ఆ పార్టీపై తన వాగ్బాణాలను సంధించారు.

Bharadwaja Reveals Shocking Facts About Amaravati Development Secrets | Chandrababu | Telugu Rajyam