2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ లేచి ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కు చేదు ఫలితాలు ఎదురు కాగా 2024 ఎన్నికల్లో ఆ తప్పు రిపీట్ కాకూడదని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తనపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు భారీ షాక్ ఇచ్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ గురించి త్వరలో పవన్ అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా పోటీకి దూరంగా ఉంటారని ప్రచారం జరుగుతున్నా టీడీపీ నేతలు మాత్రం మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. మంగళగిరి అభివృద్ధి కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డాడని ఆ కష్టానికి తగ్గ ఫలితం ఏదో ఒకరోజు దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. పవన్, లోకేశ్ రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలని పవన్ ప్రయత్నిస్తుండగా ఒక్క రాజకీయ పార్టీని ఓడించటానికి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు జగన్ సైతం టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా గట్టి పోటీ ఇచ్చేలా తనదైన వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. అయితే ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంటుందో క్లారిటీ రావాల్సి ఉంది.
వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతోమంది పేద ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. రైతులకు సైతం బెనిఫిట్ కలిగేలా జగన్ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఖాతాలలో ప్రభుత్వం భారీ స్థాయిలో నష్ట పరిహారం జమ చేస్తుండటంతో ఆ విధంగా కూడా రైతులకు బెనిఫిట్ కలుగుతోంది. 2024 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
