జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన గుంటూరు టీడీపీ నేతలు

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతలు రేపు మరొక పార్టీలో కనిపిస్తున్నారు. పదవులపై ఆశతోనో, ప్రలోభాలకు గురయ్యో ఇలా కారణాలు అనేకం. జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుండి అఆయన పర్యటిస్తున్న పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు కొందరు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారం గుంటూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు బుధవారం పార్టీని వీడి వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఆ వివరాలు కింద ఉన్నాయి చదవండి.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర బుధవారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సాగింది. సాలూరు మండలంలోని తాడిలోవ సమీపంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు జగన్ ని కలిశారు. ఆయన సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, గుంటూరు జిల్లా ఇంచార్జి నేతృత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ వలేటి హిమాంతరావు, పెంటేల శ్రీనివాసరావు, మేకపాట నాగభూషణరావులు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వీరికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు విడదల గోపి, కోటిరెడ్డి, ఉపేంద్ర, కమలేంద్ర హాజరయ్యారు.