సీఎం జగన్ 24 గంటల ఆదాయం రూ. 300 కోట్లు !

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి .. రాయలసీమ సీనియర్ నేత , టీడీపీ కీలక నేత. ఈయన నోటి వెంట వచ్చే ప్రతి మాట కూడా ఓ సంచలనమే. తాజాగా ఈయన నేడు ఓ మీడియా మీట్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది ఎంతవరకు నిజమో..? అబద్ధమో..? తెలియదు కానీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

YS Jagan collecting detailed report on party leaders 
YS Jagan  

అలాగే ,డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో ఆయన గెలుపొందుతున్నారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారని.. అయినా వైసీపీతో పోటీ పడి డబ్బులు ఇవ్వలేక ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో..? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారో..? ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగిన అడ్వకేట్ దంపతుల హత్య గురించి జేసీ మాట్లాడారు. అసలు ఈ దంపతుల హత్యలో అన్ని ఆధారాలు వున్నా విచారణ ఎందుకు..? అని జేసీ ప్రశ్నించారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచనలం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్‌ తులసిగరి శ్రీనివా‌స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అతడు ఇతర నిందితులతో కలిసి కుట్రలో పాల్గొని, వారికి కారు, కత్తులను అందించినట్టు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.