రాజకీయాలకు దూరంగా లోకేశ్.. ఆయన సైలెన్స్ కు కారణం ఏంటో?

YSRCP supporters cracking jokes on Chandrababu Naidu, Lokesh

చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్ రాజకీయాలకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. లోకేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అయితే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని భావించి చంద్రబాబు లోకేశ్ ను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

సోషల్ మీడియాలో లోకేశ్ యాక్టివ్ గా ఉన్నా ఏపీలో సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పరిమితం అనే సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్ర ఉంటుందో లేదో చూడాల్సి ఉంది. లోకేశ్ పాదయాత్ర ఖర్చు భారం టీడీపీ ఇంఛార్జులపై పడనుందనే వార్త కొంతమందిని కంగారు పెడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి. సర్వేల ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు వయస్సు 72 సంవత్సరాలు కాగా ఆయనను వయస్సు సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి.

2029 ఎన్నికల సమయానికి తాను ప్రచారంలో కూడా పాల్గొనే పరిస్థితి ఉండకపోవచ్చని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఏపీ రాజకీయాల విషయంలో వారానికో ట్విస్ట్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు,