ఎనిమిదిమంది మరణం.. చంద్రబాబుకు కనీస జ్ఞానం లేదా?

chandrababunaidu

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను ఎక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నా ఎక్కువ సంఖ్యలో జనం హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆ అతి ప్రచారమే ఇప్పుడు ఆయనను నిండా ముంచింది. కందుకూరులో జరిగిన సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఒక సభకు హాజరై ఎనిమిది మంది మరణించడం అంటే చిన్న విషయం అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మృతి చెందిన వాళ్లలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తన సభలకు వచ్చిన వాళ్లను చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడం గమనార్హం.

మృతి చెందినవారంతా టీడీపీ వీరాభిమానులని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సభకు వస్తున్న జనం గురించి అంచనా వేసి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ సభలో ఇదే విధంగా జరిగి ఉంటే ఎల్లో మీడియా సైలెంట్ గా ఉండేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

డ్రోన్ షూటింగ్ కోసం చేసిన ప్రయత్నం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది చెబుతున్నారు. ఇరుకు రోడ్లలో సభ నిర్వహించి అమాయకుల ప్రాణాలు పోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. చంద్రబాబు గతంలో కూడా ప్రచారం కోసం పరితపించి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.