మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలలో తరచూ తొక్కిసలాట జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కొంతమంది భావిస్తే వైసీపీ కుట్రల వల్లే ఈ విధంగా జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు సభలో మరణించిన వాళ్లను ఆర్థిక సహాయం అందించే విషయంలో కూడా టీడీపీ వెనుకడుగు వేస్తోంది.
చాలా తక్కువ మొత్తం మాత్రమే సహాయంగా టీడీపీ ప్రకటించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రకారమే టీడీపీలో ఈ విధంగా జరుగుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇకపై చంద్రబాబు సభలకు వెళ్లే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంత మొత్తం కోసం ఆశపడి ప్రాణాలకు అపాయం కలిగేలా చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు.
కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో ఈ తరహా సభలకు హాజరు కావడం ఆరోగ్యరిత్యా శ్రేయస్కరం కాదు. ఈ ఘటనల గురించి స్పందించడానికి పవన్ కళ్యాణ్ సైతం అస్సలు ఇష్టపడటం లేదు. ఈ ఘటనల్లో నిజానిజాలు దేవుడికే తెలియాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు ప్రచారం పిచ్చి ఎంతోమంది అమాయకులను బలి తీసుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సైతం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఘటనల వల్ల చంద్రబాబుపై కేసులు నమోదవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర సమయంలో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 300 రూపాయల విలువ చేయని నాసిరకం కిట్లతో చంద్రబాబు అమాయకపు ప్రజల ప్రాణలతో ఆడుకుంటున్నారు.
