వైసీపీకి సాయం చేస్తున్న టీడీపీ అధినేత.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేయడమేంటి.? ఔను, నిజంగానే సాయం చేస్తున్నారు వైసీపీకి చంద్రబాబు. కానీ, ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. చంద్రబాబు ఎంతలా జనంలోకి వెళితే, వైసీపీకి అంత లాభం అన్నట్టు తయారైంది పరిస్థితి.

మొన్నీమధ్యనే ఖమ్మంలో చంద్రబాబు పర్యటిస్తూ, కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టింది తానేనని చెప్పుకున్నారు. మొన్నామధ్య ఏపీలో పర్యటించినప్పుడు, ఐటీ పరిశ్రమని ఉద్ధరించింది తానే గనుక, తనకు అంతా రాయల్టీ కట్టాలంటూ చంద్రబాబు హుకుం జారీ చేసేశారు.

ఉత్తరాంధ్రలో చంద్రబాబు తాజాగా పర్యటనిస్తే, పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు ఆయన వెంట నడిచాయి. నిజానికి, గతంతో పోల్చితే, చంద్రబాబు పర్యటనలకు జనం పోటెత్తుతున్నారు. అయితే, ఆ జనాన్ని చూసి తామే అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీ నమ్మితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

చంద్రబాబు మాటల్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు.? అన్నది ముఖ్యమిక్కడ. ఈ రోజుల్లో రాజకీయ సభలకు జనాన్ని తరలించడం అనేది పెద్ద టాస్క్ కాదు. డబ్బులు ఖర్చు చేస్తే జనం వస్తారు ఏ పార్టీ కోసమైనా. జస్ట్, రాజకీయ పార్టీల సభలకు హాజరవడం ఓ ‘రోజు కూలీ’ వ్యవహారం అన్నట్లు తయారైంది కొందరికి.

మరి, వైసీపీ సభలకు జనం ఎందుకు తరలి రావడంలేదు.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు హైద్రాబాద్‌కి చెక్కేస్తారట.. అన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.

సో, ఏపీలో వైసీపీకి తిరుగు లేనట్టే, ప్రతిపక్షం పాత్ర జనసేనకు ముందు ముందు దక్కే అవకాశాలున్నాయి ఏపీలో.. అదీ జనసేన ఆ స్థానం నిలబెట్టుకుంటే.!