తెలంగాణ ఎన్నికల్లో ఓ చిత్ర నిర్మాత శాసన సభ్యుడుగా తెలుగు దేశం తరుపున పోటీ చేస్తున్నాడు . ఆయనే భవ్య ఆనంద్ ప్రసాద్. . భవ్య క్రియేషన్ సంస్థ నిర్మాత వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్. హైద్రాబాద్లో బిల్డరుగా వున్న ఆనంద్ ప్రసాద్ 2008 నుంచి సినిమా రంగంలో నిర్మాతగా ప్రవేశించాడు . శౌర్యం , అమరావతి, వాంటెడ్ , నీకు నాకు డాష్ డాష్ , లౌక్యం , సౌఖ్యం, శమంతక మణి , పైసా వసూల్ అనే చిత్రాలను నిర్మించాడు .
పైసా వసూల్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు కాగా నందమూరి బాలకృష్ణ కథానాయకుడు . 2017 సంవత్సరానికి ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డుల్లో ప్రత్యేక అవార్డు వచ్చింది . బాలకృష్ణ హీరో కావడం వల్లనే ఈ సినిమాకు అవార్డు వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు . పైసా వసూలు సినిమా నుంచి ఆనంద్ ప్రసాద్ బాలకృష్ణ మధ్య పరిచయం స్నేహంగా మారిందని సన్నిహితులు చెబుతున్నారు .
ఆనంద్ ప్రసాద్ హైద్రాబాద్లో పేరు మోసిన బిల్డర్ . ఆయనకు సిమెంట్ కంపెనీ కూడా వుంది . బాగా సంపాదించాడని చెప్పుకుంటారు . తెలంగాణ తెలుగు దేశం పార్టీ తరుపున ఆనంద్ ప్రసాద్ పోటీ చేసే విషయంలో బాలయ్య పాత్ర ఉందని, బాలయ్య చెప్పడం వల్లనే చంద్ర బాబు నాయుడు ఆనంద్ ప్రసాద్ పేరును శేరి లింగంపల్లి స్థానానికి ఖరారు చేశారని తెలుస్తుంది .
తెలుగు దేశం పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులకు ఆనంద్ ప్రసాద్ ఆర్ధికంగా అండగా ఉంటాడని , అందుకే ఆయన పేరును బాలయ్య ప్రతిపాదించినట్టు చెబుతున్నారు .
