ఏబీఎన్ బ్రోకర్ కృష్ణ: పవన్ అభిమానుల ట్వీటాస్త్రాలు.!

మళ్ళీ మొదలైంది రచ్చ.! ఏబీఎన్ రాధాకృష్ణని ‘బ్రోకర్ కృష్ణ’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. జనసేన అధినేతతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ వెయ్యి కోట్ల ప్యాకేజీ డీల్‌కి తెరలేపారన్నది రాధాకృష్ణ వండి వడ్డించిన వంటకంపై జనసేన గుస్సా అవుతోంది.

‘ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్.. తద్వారా టీడీపీ – జనసేన బంధాన్ని తెంచి, వైసీపీకి సాయపడే వ్యూహం..’ అంటూ వెయ్యి కోట్ల ప్యాకేజీ డీల్ గాసిప్‌ని వేడి వేడిగా వడ్డించే క్రమంలో రాధాకృష్ణ షరామామూలుగానే చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. అయినా, జనసేన అధినేతతో చీవాట్లు తినడం ఏబీఎన్ రాధాకృష్ణకి కొత్తేమీ కాదు. కాస్తంత సంస్కారాన్ని మీ తండ్రికి నేర్పండంటూ.. గతంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణ వారసులకు సూచిస్తూ సెటైరికల్ ట్వీటేశారు.

‘ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా..’ అంటూ వైసీపీకి గతంలో చూపిన చెప్పునే పవన్ కళ్యాణ్ రేపో మాపో ఏబీఎన్ రాధాకృష్ణకి కూడా చూపించాల్సి వస్తుందేమో. తారక రత్న మరణ వార్త ఖరారయ్యాక, ఏబీఎన్ రాధాకృష్ణ ఈ వెయ్యి కోట్ల ప్యాకేజీ వంటకాన్ని చంద్రబాబు కనుసన్నల్లో వండారా.? అంటే, ఔననే చర్చ సర్వత్రా జరుగుతోంది.

లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజే అదే పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు వారసుడు.. నందమూరి తారకరత్నని బలి తీసుకున్నాడన్న చర్చ జనాల్లో జరుగుతోంది. దానికి విరుగుడుగా.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ.. అంటూ పిచ్చి కథనాల్ని రాధాకృష్ణ ప్రచారంలోకి చేశాడన్నది జనసైనికుల ఆరోపణ.

ఈ నేపథ్యంలోనే ‘#ABNBrokerKrishna’ అంటూ జనసేన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు.