మళ్ళీ సల్మాన్ ఖాన్ శిల్పా శెట్టి జోడి ?

చాలాకాలం తరువాత సల్మాన్ ఖాన్ మరియు శిల్ప శెట్టి కలసి నటించబోతున్నారా ? అవునననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు . ఈ ఇద్దరు ఒకప్పుడు గొప్ప ప్రేమికులు . ఒకర్నివిడిచి మరొకరు ఉండేవారు కాదు . సల్మాన్ కూడా శిల్ప ఇంటికి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వచ్చేవాడు . దీనిపై అప్పట్లతో బాలీ వుడ్ లో అనేక కథలు వచ్చాయి . అయితే వాటన్నింటినీ శిల్ప కొట్టివేసింది . “సల్మాన్ నాకు ఓ మంచి స్నేహితుడు . నా మొదటి సినిమా “ఓమ్ శాంతి ఓమ్ ” చిత్ర కథానాయకుడు . నాకు అతని అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చాడు . అందుకే అతనంటే నాకు అభిమానము , ప్రేమ పేరుతో మేము ఎప్పుడూ బయటకు వెళ్లి పార్టీలు చేసుకున్న సందర్భం లేదు . మేము ఇద్దరం కల్సి “షాదీ కర్కే పాస్ గయా యార్ “, “ఫిర్ మిలేంగే “, “ప్రైడ్ అండ్ హానర్ ” , “ఆజార్ ” చిత్రాల్లో నటించాము . ఇన్ని సినిమాలో నటించిన తరువాత ఎవరైనా సన్నిహితులు కాకుండా వుంటారా ?” అంటూ ప్రశ్నిస్తోంది శిల్ప .

అయితే ఈ ఇద్దరికీ ఏమైందో తెలియదు . 1997లో “ఆజార్” చిత్రం తరువాతకలసి నటించలేదు . కారణాలు తెలియవు . ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు . 2009 లో శిల్ప రాజ్ కుంద్రా ను వివాహం చేసుకుంది . వీరికి ఒక బాబు జన్మించాడు . ఈ మధ్య మళ్ళీ వీరిద్దరూ వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు . ఆజార్ సినిమా సీక్వెల్ చేస్తున్నారని , సల్మాన్ , ఖాన్ తో శిల్ప నటించబోతున్నదని . దీనిపై శిల్ప స్పందించింది . ” నిజమే ఆజార్ 2 చెయ్యాలనే ఆలోచన రావడం మంచిదే. మేమిద్దరం మళ్ళీ కలసి నటిస్తున్నామనే ఆలోచేనే నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది . మేమిద్దరం మానసికంగా చాలా ఎదిగాం , విజయాన్ని సాధించాము . మా జోడీని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనే నమ్మకం వుంది ” అని చెప్పింది .  అయితే దీనిపై సల్మాన్ మాత్రం పెదవి విప్పలేదు .