మ‌హ‌మ్మారీ టెన్ష‌న్ పెడుతున్నా నిఖిల్ టీమ్ డేరింగ్

ఓవైపు మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు విజృంభిస్తూ కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. దేశ విదేశాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. భార‌త‌దేశం మ‌రో ఇట‌లీలా భ‌యాన‌కంగా మారింద‌న్న రిపోర్ట్ అందింది. క‌రోనా పాజిటివ్ కేసుల్లో టాప్ 5లోకి దూసుకొచ్చింది మ‌న దేశం. ఇక‌పోతే విదేశాల్లోనూ ప‌రిస్థితి ఏమాత్రం బాలేదు. అయితే ఇలాంటి స‌మ‌యంలో విదేశీ షూటింగుల కోసం మ‌న‌వాళ్లు ప్లాన్ చేస్తుండ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

ముఖ్యంగా కార్తికేయ 2 టీమ్ ఏకంగా కాంబోడియా వెళ్లి అక్క‌డ ద‌ట్ట‌మైన అడ‌వుల్లో కొండ‌ల్లో షూటింగులు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. అయితే కాంబోడియా వ్యాప్తంగా ప‌లు ప్ర‌ఖ్యాత దేవాల‌యాలు ఉండ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. కొన్ని ప్ర‌మాదాలు ఉన్నా కానీ ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన నేచుర‌ల్ బ్యూటీ అక్క‌డ ఆక‌ట్టుకుంటుంది. అందుకే చందు టీమ్ కాంబోడియా వెళ్లేందుకే నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం రీస్ అనే చోటికి వెళ్లి లొకేషన్ అనుమ‌తులు కోర‌నున్నార‌ని తెలిసింది. ఇక కార్తికేయ 2లో నిఖిల్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో హీరోకి మాజీ ప్రేయ‌సిగా క‌నిపించ‌నుంద‌ట‌. సీక్వెల్ కి చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. థ్రిల్లింగ్ హిస్టారిక‌ల్ మూవీగా తెర‌కెక్కించ‌నున్నారు. అక్క‌డ మిస్టీరియ‌స్ పురాత‌న‌ టెంపుల్స్ లో కీల‌క భాగం షూటింగ్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్ – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మి‌స్తున్నాయి.

CAMBODIA Know BEFORE YOU GO | Little Grey Box