కేరళకు సన్నీ లియోన్ సాయం…

కేరళలో వరద బీభత్సము దాడికి ఇప్పటి వరకూ 400 మంది పైగా మృతి చెందగా… 6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. టాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ కు చెందిన పలువురు సినీ తారలు , దర్శక నిర్మాతలు భారీగా విరాళాలిచ్చారు . బాలీవుడ్  నటి సన్నీ లియోన్ కూడా 5 కోట్లు విరాళమిచ్చిందని వదంతులు వచ్చాయి . అయితే ఆ వదంతులకు సన్నీ తాజాగా చెక్ పెట్టింది. కేరళ వరద భాదితులకు 1200 కేజీల బియ్యం , పప్పును  సన్నీ విరాళంగా ఇచ్చింది. తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సన్నీ పోస్ట్ చేసింది.

 

కేరళ వరద కారణంగా ఎన్నో అవస్థలు పడుతున్న ప్రజలలో కొంతమందికి ఆహరం అందించదలచుకున్నామని సన్నీ తెలిపింది. అయితే ఈ సాయం కేరళకు ఏ మాత్రం సరిపోదని ఇంకా వీలైనంత సాయం చేయాలనీ తాను కోరుకుంటున్నానని తెలిపింది. తాజాగా సన్నీ చేసిన సాయంతో ఆమెపై గతంలో వచ్చిన పుకార్లు అవాస్తవమని తేలాయి.