నిర్మాతపై సుమంత్ ఫైర్..ఇప్పుడెన్ని మాట్లాడినా లాభమేంటి?

ఈమ‌ధ్య కాలంలో హిట్ అంటూ లేని సుమంత్… మ‌ళ్లీ రావా, సుబ్ర‌మ‌ణ్య‌పురం చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆయన తాజాగా న‌టించిన చిత్రం ఇదం జ‌గత్. నూత‌న ద‌ర్శ‌కుడు అనిల్ శ్రీకంఠం తెర‌కెక్కించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. సుమంత్ స‌ర‌స‌న అంజు కురియన్ న‌టించిన ఈ చిత్రం… క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ మార్నింగ్ షో కే తెచ్చుకుంది. క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి తన కెరీర్ లో చేయనటువంటి నెగిటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ ని ఈ సినిమాలో సుమంత్ చేసాడు. దాంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. టాక్ మాట తర్వాత ముందు ఓపినింగ్స్ కూడా లేకపోవటం సుమంత్ ని చాలా బాధపెట్టిందిట. నిర్మాతలు ఇక ఈ డేట్ దాటితే థియోటర్స్ దొరకవని హడావుడిగా రిలీజ్ చేసారు,దాంతో పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ అవడంతో దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి . ఈ సినిమా విడుదల అయినట్లు చాలామంది కి తెలియదు. కలెక్షన్లు ఎలా ఉన్నాయి , టాక్ ఎలా ఉంది అన్న విషయం కనుక్కున్న సుమంత్ కు బయ్యర్లు ఈ విషయం చెప్పారట .

దాంతో కోపంతో ఊగిపోయాడట సుమంత్ . థియేటర్ లు కూడా ఎక్కువగా లేవు.. దాంతో ఇంత దారుణంగా ఎలా రిలీజ్ చేసారు అంటూ మండిపడ్డాడట . సినిమా చేస్తామని వచ్చినప్పుడు ఈ విషయాలన్ని మాట్లాడుకున్నాం కదా..గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని, మంచి పబ్లిసిటీ చేస్తామని అప్పుడు చెప్పి ఇలా మోసం చేసారేంటి అన్నారట. ఇక సినిమా రిలీజ్ చేయటం రాకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ డబ్బులు ఇలా అందరూ నష్టపోయేలా చేసారంటూ నిర్మాతని తిట్టేశాడట . మీకు చాతకాకపోతే నేనే రిలీజ్ చేసుకుందును కదా అని అన్నారుట. అయితే చేతుల కాలాక ఆకులు పట్టుకుంటే కలిసొచ్చేదేముంది సుమంత్. రిలీజ్ అయ్యిపోయాక ఇప్పుడు ఎన్ని మాట్లాడుకుంటే ఏమి కలిసొస్తుంది.