పవన్ పై శ్రీరెడ్డి మళ్లీ కామెంట్స్ …డోస్ పెంచింది

శ్రీరెడ్డి ఇంతకు ముందు సైతం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై మాటల యుద్దం చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రీసెంట్ గా తెలంగాణా ఎలక్షన్ వేళ ఓ లైవ్ వీడియోతో జనం ముందుకు వచ్చి రచ్చ చేసింది. పవన్ కు డైరక్ట్ ఛాలెంజ్ వదిలింది.

ఇప్పుడు మరోసారి పవన్ ని టార్గెట్ చేసింది. ఈ సారి పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తుపై సెటైర్స్ పేల్చింది. ఇది గాజు గ్లాస్ ఆ లేకా బీరు గ్లాస్ ఆ అంటూ కామెంట్స్ పేల్చింది.

“అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా? వైన్ గ్లాసా? లేక స్కాచ్ గ్లాసా? పనిలోపనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా. అసలే రీసెంట్ గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు” అంటూ కామెంట్స్ చేసింది

శ్రీరెడ్డి ఇలా జనసేన గుర్తు పై కామెంట్స్ చెయ్యడం పైన పవన్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఆమె పెట్టిన పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.