పవన్ పై శ్రీరెడ్డి మరో సెటైర్.. ఫ్యాన్స్ సీరియస్

భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుతుందని మనకు తెలుసు కదా. ఇప్పుడు పొలిటికల్, సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమంటే..? శ్రీరెడ్డి అనే సినీ యాంకర్ రోజు లేవగానే తనగురించి ఆలోచిస్తూనే అస్తమానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆలోచిస్తున్నది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు శ్రీరెడ్డి పవన్ కళ్యాన్ ను కలవరిస్తూనే ఉంటుంది. పవన్ తుమ్మినా, దగ్గినా ఇంకేం చేసినా శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో తన వాల్ మీద రియాక్ట అవుతుండడం కామన్ అయిపోయింది.
శ్రీరెడ్డి ఎంత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా కూడా పవన్ ఫ్యాన్స్ సమయమనంతో ఉన్నారు. చాలామంది ఫ్యాన్స్ ఆమెను పట్టించుకోవడమే మానేశారు. అయితే సందు దొరికితే చాలు శ్రీరెడ్డి పవన్ మీద రెచ్చిపోతూనే ఉన్నారు. పాత లింకులన్నీ తెచ్చి పవన్ ను అవమానపరిచేలా పోస్టింగ్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ కూడా శ్రీరెడ్డిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎప్పుడో చనిపోయిన నాయకుడు పరిటాల రవీంద్ర పేరును తీసుకొస్తూ ఒక పోస్టు పెట్టారు. పవన్ ను పులివేశం వేసుకున్న నక్కగానూ, ఆయన ఫ్యాన్స్ ను గొర్రెలుగానూ అభివర్ణిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టుపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి పెట్టిన తాజా పోస్టు కింద ఉంది చూడండి.

“బొమ్మ హీరో కాదురా గొర్రెలారా – ట్రూ హీరోరా పరిటాల రవిగారు.ఆయనే ఉండుంటే ..గడ్డానికి -జుట్టుకి పెయింటింగ్ లు వేసుకునేవాళ్ళు సీఎం అవ్వకుండా కాపాడేవారు.గడ్డం పెంచుకుంటే ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చేగువేరా అవుతారా..నిద్ర లేవండి గొర్రెలారా ..అసలే వర్షాకాలం ర నాయన వానలోకి వెళ్లోద్దని చెప్పండి రంగు పోద్ది ..మీ పులి వేషం వేసుకున్న నక్కకి.# పిచ్చి లీక్స్ ” అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

 

ఈ పోస్ట్ చూసిన చాలా మంది ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పెట్టిందనే అంటున్నారు