రానా తీవ్ర ఆరోగ్య సమస్యల కారణంగా రానా చిన్న బ్రేక్లో ఉన్నారని సమాచారం. ఓ నెల విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ యాక్షన్లోకి రానున్నారని తెలిసింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి మళ్లీ షూటింగ్స్ను స్టార్ట్ చేస్తారట. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి జంటగా ‘విరాట పర్వం’ అనే చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. రానా తన పాత్ర షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు. మిగతా సన్నివేశాలను షూట్ చేస్తున్నారు చేశారు కూడా, సెప్టెంబర్లో ‘విరాట పర్వంలో’ సెట్స్లోకి అడుగుపెడతారట. ఆ తర్వాత గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘హిరణ్య కశ్యప’ కూడా మొదలుపెడతారని తెలిసింది.అయితే రానా కి ఆరోగ్యం ఎంత వరకు సపోర్ట్ చేస్తుంది చూడాలి.