“విరాట పర్వం 1992” : శర్వాతప్పుకుని రానా సీన్ లోకి..

(సూర్యం)

ఒక కథని ఫలానా హీరో చేస్తాడని ఊహించి దర్శకుడు, రచయిత రాస్తూంటారు. అయితే కొంతదూరం ప్రయాణం చేసాక తను అనుకున్న సదరు హీరో ఆ పాత్ర తనకు సెట్ కాలేదోనో, డేట్స్ ఖాళీ లేవనో తప్పుకుంటే మరో హీరో వచ్చి ఆ ప్లేస్ లో ఆక్యుపై చేస్తాడు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. శర్వానంద్ తో అనుకుంటున్న ఓ ప్రాజెక్టులోకి రానా వచ్చి చేరాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే శర్వాతో అనుకున్న క్యారక్టర్..రానాకు ఎలా సెట్ అవుతుందనేది ఓ బిగ్ మిలియన్ డాలర్ క్వచ్చినే. ఎందుకంటే ఇద్దరి ఇమేజ్ వేరు..బాడీ లాంగ్వేజ్ వేరు.

ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే… నీదీ నాదీ ఒకటే కథ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడిగల. ఆయన దర్శకత్వంలో తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం అవుతోంది. ఈ మేరకు శర్వానంద్ కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకుని ఆఫీస్ తీసారు. స్టోరీ డిస్కషన్స్ నడిచాయి. అయితే లాస్ట్ మినిట్ లో శర్వా ..తను వేరే ప్రాజెక్టులతో పూర్తిగా ఎంగేజ్ అయ్యి ఉన్నానని తప్పుకున్నారు. ఆ తర్వాత రానా దగ్గుపాటి దగ్గరకు వచ్చింది. ఆయన ఓకే చేసినట్లు సమాచారం.

ఇక ఈ సినిమా పేరు “విరాట పర్వం 1992”. ఈ సినిమాలో సాయి పల్లవి కీ రోల్ చేస్తోంది. సాయి పల్లవితో సినిమా అంటే దాదాపు క్రెడిట్ అంతా ఆమెకే వెళ్లిపోతోందనే టాక్ ఉంది. ఫిదా సినిమాకు అదే జరిగింది…వరుణ్ తేజ కన్నా ఆమెకే హైప్ వచ్చింది. నాని నటించిన ఎమ్ సి ఎ లోనూ అదే పరిస్దితి. మరి ఈ సినిమాలో రానాకు హైప్ వస్తుందో..సాయి పల్లవి దూసుకువెళ్తుందో చూడాలి. దర్శకుడు విషయం ఉన్నవాడు కాబట్టి, కొత్త తరం ఆలోచనలతో సినిమాని నిలబెడతారని నమ్మచ్చు.