బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి తెలియ చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తన తదుపరి చిత్రం ‘RRR’ (వర్కింగ్ టైటిల్) రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ కొత్త చిత్రం మల్టీ స్టారర్గా తెరకెక్కనుంది. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించనున్న ఆ చిత్రానికి ఈ ఏడాదిలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఏవీ బయటికి రావడం లేదు.

‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇదేకావటంతో… దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ కొత్త ప్రచారం మొదలైంది. ఈ సినిమా కథ మంచి హిట్టైన బాలీవుడ్ చిత్రం ‘గుండే’ నుంచి ప్రేరణ పొందారని ఆ ఛాయలలో సాగుతుందనీను. అర్జున్ కపూర్ – రణవీర్ సింగ్ – ప్రియాంక చోప్రా కీ రోల్స్ లో చేసిన ఈ సినిమాను ఎన్టీఆర్.. రామ్ చరణ్ ల ఇమేజ్ కి ..
తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడో లాజిక్ జనం మర్చిపోతున్నారు. హిందీలోనూ ఈ
సినిమాను రిలీజ్ చేసేటప్పుడు …అక్కడ సినిమాను రాజమౌళి ఎందుకు లేపుతాడు. ఆ మాత్రం తెలివి రాజమౌళి కు ఉండదా.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబరులోనే సినిమాని ప్రారంభిస్తారు. రాజమౌళి మాత్రం ఇప్పటికే సినిమాకు సంభందించిన పనులు మొదలు పెట్టినట్టు తెలిసింది. తన సోదరుడు ఎమ్.ఎమ్.కీరవాణి సారథ్యంలో మ్యూజిక్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, రామ్చరణ్ ఇదివరకే ఓ చిన్న వర్క్షాప్లో పాల్గొన్నారు.

ఈ సినిమా కోసం తారక్, చెర్రీ ప్రత్యేక వర్క్షాప్కు హాజరుకానున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మేరకు రాజమౌళి ఇద్దరు స్టార్స్కు సమాచారం అందించారని, నవంబరులో ఇది జరగనుందని సమాచారం. ఈ వర్క్షాప్లో వీరితోపాటు మిగిలిన సాంకేతిక బృందం కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.

