(సూర్యం)
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఓ అతి పెద్ద డిసాజాస్టర్ గా నిలిచిన సినిమా “స్పైడర్”. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫై మహేష్ అభిమానులు భారి అంచనాలు పెంచుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కలిసి మురగదాస్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. అయితే ఇప్పుడు మరోసారి తెలుగువాళ్లు మురగదాస్ ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకూ అంటే విజయదేవరకొండ వల్ల. విజయ్ దేవరకొండ సినిమాలో మురగదాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.
తమిళ వెర్షన్ దాకా మురగదాస్ అనే ఎలిమెంట్ కలిసిరావచ్చు ఏమో కానీ తెలుగుకు మాత్రం వన్ పర్శంట్ కూడా కలిసిరాదు. అదే మన తెలుగు టాప్ దర్శకులని ఎవరైనా గెస్ట్ గా తెలుగు వెర్షన్ కు తీసుకుంటే బెస్ట్ అంటున్నారు.ఈ విషయం విజయదేవరకొండ అయినా చెప్తే బాగుంటుందని అతని అభిమానులు సోషల్ మీడయాలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత పెద్ద డైరక్టర్ ని మాత్రం విజయ్ దేవరకొండ కాదనగలడా.
ఇక నోటా దర్శకుడు ఆనంద్ శంకర్.. మురుగదాస్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. దాంతో తన గురువునే డైరెక్ట్ చేస్తుండటంతో ఆనందంలో
విహరిస్తున్నాడు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్కు అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది.