ప‌వ‌న్ ముచ్చ‌ట‌గా 3వ‌ది లాక్ చేసాడా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా ఇప్ప‌టికే రెండు సినిమాల‌ను లైన్ లోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వేణు శ్రీరామ్ దర్శ‌క‌త్వంలో లాయ‌ర్ సాబ్ చిత్రాన్ని సెట్స్ కు తీసుకెళ్లారు. బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పింక్ కి రీమేక్ రూపం ఇది. ఇక ఈరోజు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా ప్రారంభం కాబోతుంది. ఈనెల 27నే ప్రారంభం కావాల్సిన సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల డిలే అయింది. దీంతో నేటికి వాయిదా వేసి లాంచ్ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. ప‌వ‌న్ ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమాని కూడా సెట్స్ కు తీసుకెళ్లాల ని ప్లాన్ చేస్తున్నారు. సైరా న‌ర‌సింహారెడ్డితో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన సురేంద‌ర్ రెడ్డి క‌థ‌కు పవన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. సైరా లాంటి స్వాతంత్ర్య స‌మ‌య‌రయోధుడి క‌థ‌లాగే ప‌వ‌న్ స్టోరీ కూడా ఉంటుంద‌న్న ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ ని వెడెక్కిస్తోంది. పండ‌గ‌సాయ‌న్న అనే స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి జీవిత క‌థ‌లోనే ప‌వ‌న్ న‌టించ‌న‌న్నార‌ని ఓ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది ప‌వ‌న్ తేల్చాలి. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇప్ప‌టికే అభిమానుల్లో జోష్ ని నింపింది. ఏకంగా ఒకేసారి రెండు సినిమాల‌తో ట్రీట్ ఇవ్వ‌బోతున్నారు. ముచ్చ‌ట‌గా మూడ‌వ‌ది ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది.