కబడ్డీ వ్యాఖ్యాతగా నిత్యామీనన్

విలక్షణమైన పాత్రలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తాజాగా ఈమె మరో కొత్త అవతారం ఎత్తారు. అది కూడా సినిమా రంగానికి పరిచయం లేని రంగంలో కావడం విశేషం. ఇంతకు నిత్యామీనన్ ఎత్తిన కొత్త అవతారం ఏంటో తెలుసా? ప్రో కబడ్డీ కోసం ఆమె వ్యాఖ్యాతగా మారడమే. ఆగస్ట్ 15న మిషన్ మంగల్ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ ప్రో కబడ్డీలో సందడి చేసింది. నటి విద్యాబాలన్‌తో కలిసి నిత్యామీనన్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలల్లో నిత్యామీనన్ వ్యాఖ్యానం చేయడం విశేషం.