తాత ఎన్టీఆర్ నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్

శ్రీకాకుళం ప్రాంతాన్ని  పెను తుపాను కమ్మేసింది . దిక్కుతోచని స్థితిలో పాలను నిస్సహాయంగా సర్వం కోల్పోయి ఎదురు చూస్తున్నారు . ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది . ప్రజలు జలదిగ్భందంలో వున్నారు . ప్రభుత్వం తక్షణం స్పందించి సహాయ చర్యలను చేపట్టింది . ప్రైవేట్ సంస్థలు కూడా ఆపన్నులను ఆదుకోవడానికి రంగంలోకి దిగాయి. . వరద నష్టాన్ని అంచనావేసి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రధాన  మంత్రికి  ఓ లేఖ కూడా రాశాడు

ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గతంలో నటరత్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు కొంతకాలం తమ సినిమాలు వాయిదా వేసి మరీ సహాయం చేసేవారు . మరి ఇప్పుడు సమాజాన్ని గురించి ఆలోచించేవారు తగ్గిపోతున్నారు . అయితే రామారావు  వారసత్వాన్నే  కాదు, సేవా గుణాన్ని కూడా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ శ్రీకాకుళం వరద బాధితులకు 15 లక్షల రూపాయలను ప్రకటించాడు . నందమూరి కళ్యాణ్ రావు 5 లక్షలను ప్రకటించాడు . ఇంతకూ ముందే సంపూర్ణేష్ బాబు కూడా 50 వేళా రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు .

ఈ డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్టు వీరు  తెలిపాడు .ఎక్కడో కేరళలో జరిగిన తుఫాను బాధితులను ఆడుకోవడాని ముందుకు వచ్చిన మన హీరోలు , తెలుగు గడ్డ మీద జరిగిన జల ప్రళయానికి గురైన బాధితులను ముందుకు రాక పోవడం మాత్రం విచారకరం. దీనిపై ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి .