చూస్తూంటే నాగబాబు..ఇప్పుడిప్పుడే బాలకృష్ణను వదిలేలా కనపడటం లేదు. ఇప్పటికే రెండు సార్లు బాలకృష్ణపై పరోక్షంగా విమర్శలు చేసిన ఆయన మరోసారి ట్విట్టర్ ఓ వీడియో అప్ లోడ్ చేసి ..బాలకృష్ణను టార్గెట్ చేసారు. ఓ చిన్నపిల్లవాడు అద్బుతంగా పాడిన సారే జహాసే అచ్చా గీతాన్ని ట్వీట్ చేసి మరింత రచ్చ రచ్చ చేసాడు .
మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తూ … సారే జహాసే అచ్చా గీతాన్ని పాడారు. అయితే ఆ గీతాన్ని సరిగ్గా పడలేక హే బుల్ బుల్ అంటూ పాడి నవ్వులు పాలయ్యారు. ఆ రెండు రోజులు బాలయ్య బుల్ బుల్ వీడియో ట్రెండ్ సెట్ చేసింది.
అంతా ఆ విషయం మార్చిపోతున్న సమయంలో .. ఓ చిన్న పిల్లాడు పాడిన ఆ గీతాన్ని పోస్ట్ చేయటం ద్వారా బాలయ్య ఆ మాత్రం కూడా పాడలేకపోయాడు అంటూ ట్వీట్ చేసినట్లుగా ఉంది . ఇదంతా చూస్తూంటే బాలయ్య కు తిక్క రేగి ,నాగబాబు పై ఘాటుగా విమర్శలు చేస్తాడని అందరూ అంచనాలు వేస్తున్నారు !
