నటసింహ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు గట్టి కౌంటర్ వేసే సరికి సీన్ మరింత వేడెక్కింది. దీంతో ఆ వార్ మెగా-నందమూరి కుటుంబాలకు ఆపాదించి వస్తోన్న కథనాలు అంతకంతకు సన్నివేశాన్ని వేడెక్కిస్తున్నాయి. మెగా-నందమూరి అభిమానులు వ్యక్తిగత దూషణలకు దిగిపోతున్నారు. రెండు రోజులుగా మీడియాలో ఇదే హాట్ టాపిక్. తాజాగా నాగబాబు మరో సంచలన పోస్ట్ పెట్టారు. ప్రజారోగ్య హెచ్చరిక అంటూ నాగబాబు ట్వీట్ మొదలు పెట్టారు. దాని సారంశం ఏంటంటే? పిచ్చి కుక్కలతో వ్యవహారం ప్రమాదకరం.
వాటిని బంధించాలి. లేదా ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి. అంతే గానీ వాటిని ఇలా రోడ్ల మీదకు వదిలేయకూడదు. వాటి పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించకూడదు. ప్రాణాలకే ప్రమాదం. అసలే ఇది పిచ్చి కుక్కల కాలం అంటూ ట్విటర్ లో పోస్ట్ చేసారు. ఇందులో నాగబాబు ఎక్కడా ఏ హీరో పేరు గానీ, ఇతరుల పేరు గానీ ప్రస్తావించలేదు. అయితే నిన్నటి నుంచి నాగబాబు-బాలయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న నేపథ్యంలో ఈ ట్వీట్ బాలయ్యను ఉద్దేశించి పెట్టినదే అంటూ సోషల్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఇంతకు ముందు ఏపీ ప్రభుత్వ పాలనను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు.
ఇప్పుడు బాలయ్యతో వివాదం నేపథ్యంలో ఆయన్ని ఉద్దేశించే ఈ సంచలన కామెంట్లు చేసారని అంటున్నారు. కేసీఆర్-చిరంజీవి నిర్వహించిన భేటీపై బాలయ్య భూములు పంచుకుంటున్నారంటూ శుక్రవారం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మెగా బ్రదర్ సీన్ లోకి వచ్చి బాలయ్యను హెచ్చరించారు. ఎం మాట్లాడుతున్నామో? ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడలని గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత బాలయ్య సైలెంట్ అయిపోయారు. మళ్లీ ఎక్కడా స్పందిచలేదు. అయితే నాగబాబు మళ్లీ ఈ పోస్ట్ పెట్టడంతో అసలు ఏం జరుగుతుందో అర్ధంకానీ సన్నివేశం ఎదురైంది. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు బాలయ్య మానసిక స్థితి సరిగ్గా లేదని..ఓసారి మానసిక వైద్య నిపుణులను సంప్రాదించాలని మండిపడ్డారు.
